సీనియర్ నటి వాణి విశ్వనాథ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పేరుకు మలయాళ నటినే అయినా తెలుగులోనూ ఎక్కువగా సినిమాలు చేసింది. ధర్మతేజ, సింహ స్వప్నం, సాహసమే నా ఊపిరి, కొదమ సింహం, మామా అల్లుడు, పరిష్కారం, సర్పయాగం, ఘరానా మొగుడు, సామ్రాట్ అశోక, గ్యాంగ్ మాస్టర్ తదితర సూపర్ హిట్ చిత్రాల్లో కథానాయికగా నటించి మెప్పించింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసిందీ అందాల తార. మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుని రాజకీయాల్లోనూ యాక్టివ్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని ఓ ప్రముఖ పార్టీలో చేరిన ఆమె అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని భావించారు. అయితే ఎందుకోగానీ మళ్లీ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. అయితే ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అవువుతోందీ అందాల తార. జయ జానకి నాయక సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది వాణీ విశ్వనాత్. రాజ్ తరుణ్ ఓరేజ్ బుజ్జిగా సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషిచింది. సినిమాల సంగతి పక్కన పెడితే వాణి విశ్వనాథ్ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. వాణి విశ్వనాథ్.. మలయాళ ప్రముఖ నటుడు, దర్శకుడు బాలు రాజ్ని పెళ్లి చేసుకుంది. వీరిది ప్రేమ వివాహం. 2002లో వీరి పెళ్లి జరగ్గా నలుగురు పిల్లలున్నారు.
అయితే వాణీ విశ్వనాథ్ కూతురు ఇప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తోంది. ఇప్పటికే ఆమె ఓవరాల్ గా మూడు సినిమాల్లో నటించింది. త్వరలోనే ఆమె నటించిన నాలుగో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? వర్షా విశ్వనాథ్. వాణీ విశ్వనాథ్ చెల్లెలు ప్రియా విశ్వనాథ్ కుమార్తెనే ఈ అందాల తార. 2022లో ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది వర్షా విశ్వనాథ్. అయితే ఈ మూవీ పెద్దగా ఆడలేదు. దీని తర్వాత మలయాళంలో పాథోన్పథం నూట్టండు అనే ఓ సినిమాలోనూ నటించింది. ఈ మూవీ అక్కడ బాగా ఆడింది.